లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులని తీర్పునిచ్చిన రిటైర్డ్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ యూపీ ఉప లోకాయుక్తగా సోమవారం ప్రమాణం చేశారు. బాబ్రీ కూల్చివేత కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సీబీఐ కోర్టుకు సురేంద్ర కుమార్ జడ్జిగా ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న ఈ కేసుపై తీర్పునిచ్చారు. ఈ నెల 6నే ఆయన ఉప లోకాయుక్తగా నియమితులయ్యారు.