కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సమీపంలో ఉన్న ఓ మసీదులో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. రంజాన్ ప్రార్థనలు జరగడానికి ముందే.. మసీదులో పేలుడు పదార్ధాలను అమర్చినట్లు పోలీసుల ప్రతినిధి ఫెర్దావస్ ఫరమార్జ్ తెలిపారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఘటన పట్ల విచారణ మొదలుపెట్టినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు. షాకర్ దారా జిల్లా మసీదు ఇమామ్ ముఫ్తీ నుమాన్ ఈ పేలుడులో గాయపడ్డాడు.