ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 19: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50లక్షలు విరాళంగా అందజేయనుంది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఎస్సీసీఎల్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ డైరెక్టర్ బలరాంలు అవగాహన ఒప్పందంపై శనివారం సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.కుమార్, ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ సురేశ్కుమార్, పూర్వవిద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్కుమార్, ఎస్సీసీఎల్ అధికారులు సూర్యనారాయణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.