న్యూయార్క్ : ఓ మహిళ తన సోఫాను రూ 36,000కు (500 డాలర్లు) అమ్మేసిన తర్వాత దాని విలువ రూ 14.6 లక్షలు (20,000 డాలర్లు)గా గుర్తించి కన్నీటి పర్యంతమైంది. వస్తువుపై సరైన పరిశోధన కొరవడటంతో తాను వేలాది డాలర్లు నష్టపోయిన తీరును జుల్స్ ష్రినర్ టిక్ టాక్ లో షేర్ చేసింది. గతంలో తనకు ఉచితంగా ఎవరో ఇచ్చిన సోఫాన్ జుల్స్ సోషల్ మీడియా వేదికపై 500 డాలర్లకు అమ్మకానికి పెట్టింది. ఇన్ స్టాలో సోఫాను అమ్మకానికి పెట్టిన కొద్ది సెకండ్లలోనే ఓ వ్యక్తి సోఫాను సొంతం చేసుకున్నారు.
దీంతో జుల్స్ సోఫా బ్రాండ్ ను గూగుల్ లో శోధించగా దాని విలువ 20,000 డాలర్ల పైచిలుకు ఉంటుందని తెలుసుకుని అవాక్కైంది. మోడ్రన్ అమెరికన్ ఫర్నిచర్ డిజైనర్ వ్లాదిమర్ కగన్ ఈ సోఫాను డిజైన్ చేశారు. వేలాది డాలర్లకు అమ్మకానికి పెట్టిన మరో సోఫా ఫోటోలనూ ఆమె డిజైన్ చేస్తూ వీటిని డిజైన్ చేసిన డిజైనరే తన సోఫాను డిజైన్ చేశారని తెలిపింది. జుల్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. జుల్స్ వేలాది డాలర్లు కోల్పోవడంపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు.