అహ్మదాబాద్, సెప్టెంబర్ 6: పేద విద్యార్థులకు ఐఐటీ శిక్షణ అందిస్తున్న ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు, గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్కుమార్కు ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. కుమార్కు సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ జాతీయ గౌరవ పురస్కారం-2021ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ (ఎన్సీటీఎస్) ప్రదానం చేసింది. గణితశాస్ర్తాన్ని సులభతరం చేసినందుకు, ఐఐటీ పరీక్షలకు ప్రిపేరయ్యే పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకుగాను టీచర్స్ డే సందర్భంగా అవార్డు ప్రదానం చేసినట్టు ఎన్సీటీఎస్ సోమవారం తెలిపింది. బీహార్కు చెందిన కుమార్.. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు రెండు దశాబ్దాలుగా శిక్షణ ఇస్తున్నారు.