శ్రీనగర్, ఆగస్టు 1: కశ్మీర్లో కొంతమంది యువకులు చదువుకోవడానికి అని పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదులుగా తిరిగివస్తున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది షకీర్ అల్తాఫ్ భట్ కూడా అలాగే వెళ్లి వచ్చాడని చెప్పారు. 2018లో చదువుకోవడానికి వెళ్లిన అల్తాఫ్ భట్ అక్కడ ఉగ్రవాద శిక్షణ తీసుకొని తిరిగి వచ్చాడని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి ఇది కొత్త సవాలు అని చెప్పారు. ఈ కోణంలో 2015-19 మధ్యకాలంలో కశ్మీర్లో కొత్తగా పాస్పోర్టు తీసుకొన్నవారి వివరాలు తీసుకొని ఆరా తీయగా.. 40 మంది పాకిస్థాన్/బంగ్లాదేశ్ వెళ్లారు. వారిలో 28 మంది ఉగ్రవాదులుగా తిరిగి వచ్చినట్టు తేలింది. మూడేండ్ల క్రితం చట్టబద్ధ వీసాలతో వందమందికిపైగా కశ్మీర్ యువకులు పాకిస్థాన్కు వెళ్లారు. వారిలో చాలామంది తిరిగి రాలేదు. వచ్చినవారి ఆచూకీ కూడా తెలియడం లేదు. బహుశా వీరంతా స్లీపర్ సెల్స్లా మారి ఉంటారని అనుమానిస్తున్నారు.