న్యూడిల్లీ : ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం పేర్కొంది. ఉత్తర, మధ్య భారత్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.
ఇక దేశవ్యాప్తంగా ఆగస్ట్, సెప్టెంబర్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవువతుందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రుతుపవనాల నిష్క్రమణ తర్వాత మరోసారి ఎల్నినో ప్రభావం కనిపించవచ్చని ఐఎండీ అంచనా వేసింది.