న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగించారు. పొలాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో గీతిక (48 కేజీలు), బేబిరోజిసనా చాను (51 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతీ చౌదరి (69 కేజీలు), పూనమ్ (57 కేజీలు), సంచమచు చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్ (+81 కేజీలు) తుదిపోరుకు చేరారు. పురుషుల కేటగిరీలో సచిన్ (56 కేజీలు) ఒక్కడే పసిడి పోరులో అడుగుపెట్టగా.. అంకిత నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్రా (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీస్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.