న్యూఢిల్లీ : ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చునని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కొన్ని రకాల కారకాలు కనిపించాయంటే తప్పనిసరిగా కొవిడ్ అని భావించి సెల్ఫ్ ఐసోలేషన్ చేపట్టాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ కొత్త జాతిని ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో కూడా పట్టుకోలేనంతగా తయారైందని విచారం వ్యక్తం చేశారు. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, వారి నివేదిక నెగెటివ్గా ఉంటుందంటే.. కరోనా రానట్టుగా భావించొద్దని ఆయన సూచిస్తున్నారు.
ఇప్పుడు ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగెటివ్గా ఉన్నప్పటికీ, కరోనా సాంప్రదాయ లక్షణాలు ఉన్నవారి మాదిరిగానే కరోనా ఫిక్స్డ్ ప్రోటోకాల్ కింద చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్ గులేరియా చెప్పారు. కరోనా వైరస్ కొత్త జాతి చాలా అంటువ్యాధి అని, సోకిన రోగి నుంచి ఒక నిమిషంలోనే మరొక వ్యక్తికి సోకుతుందని డాక్టర్ గులేరియా తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్నందున, పరీక్ష నివేదికలు రావడానికి చాలా రోజులు ఆలస్యం అవుతున్నాయని డాక్టర్ గులేరియా చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు క్లినికో-రేడియోలాజికల్ డయాగ్నసిస్ చేయాలని, సీటీ స్కాన్ చేసి కరోనా సాంప్రదాయ లక్షణాలను చూపిస్తే, వైద్యులు వెంటనే కరోనా ప్రోటోకాల్ క్రింద వారికి చికిత్స ప్రారంభించాలని సూచించారు.
వాసన పసిగట్టలేకపోవడం, జ్వరంగా అనిపించడం, చలిగా ఉండటం, ఆయాసంగా ఉండటం, బలహీనంగా, అలసటగా ఉండటం, గొంతులో నొప్పి కనిపించడం, కడుపులో నొప్పితోపాటు ఎసిడిటీ, గ్యాస్ సమస్య వంటి లక్షణాలు ఏవీ కనిపించినా కరోనాగా భావించి చికిత్స తీసుకోవాలని డాక్టర్ గులేరియా చెప్పారు. అయితే, ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు దవాఖానలకు పరిగెత్తడం కన్నా ఇబ్బందికరంగా ఉన్నప్పుడే దవాఖానలకు రావాలని ఆయన సూచించారు.
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
అమెరికా జనాభా 33 మిలియన్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..