ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందజేశారు. కత్తి మహేశ్ చికిత్స కోసం రూ.17 లక్షలు విడుదల చేసినట్లు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఒక లేఖ విడుదలైంది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ ఆర్థికసాయం అందజేశారు.
ఇటీవల తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తుండగా చెన్నై, నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తల, ముక్కు, కళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కత్తి మహేశ్ను నెల్లూరులోని హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అయితే కత్తి మహేశ్ చికిత్స కోసం పవన్ కళ్యాణ్ సాయం చేశాడని ఒకరోజు.. కాదు ఆయన అభిమానులు సాయం చేశారని మరో రోజు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ప్రతి రూపాయి కూడా కుటుంబం మాత్రమే భరిస్తూ వచ్చిందని కత్తి మహేశ్ సన్నిహితులు చెప్పారు. ఇన్సూరెన్స్ పాలసీలు క్లైయిమ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం జగన్ అధికారికంగా భారీ ఆర్థికసాయం ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!