న్యూఢిల్లీ : ఇవాళ ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. జీ 23 సభ్యుల లేఖ వ్యవహారంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది.
కొత్త కాంగ్రెస్ చీఫ్ను ఎన్నుకునే షెడ్యూల్పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 22 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 2021 జూన్ నాటికి నూతన అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని అధిష్ఠానం నిర్ణయించింది. అయితే కొవిడ్ వల్ల మే 10న జరగాల్సిన సీడబ్ల్యూసీ సమావేశం వాయిదా పడింది. ఇవాళ జరిగే సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది.