దేవరకద్ర రూరల్, జూన్ 1 : కరోనా బాధితులు మ నోధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తె లిపారు. స్నేహ చికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పీహెచ్సీలకు ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వితరణ చేయగా.., దేవరకద్ర పీహెచ్సీలో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే ఆల వైద్యులకు అందజేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పీహెచ్సీ వెనుక భాగంలో ఐసీయూ భవనాన్ని నిర్మించేందుకు ప్ర తిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాల ని కోరిన వెంటనే స్నేహ చికెన్ ఫౌండేషన్ రామిరెడ్డి ఐదు మిషన్లు ఇచ్చారన్నారు. వీటిని దేవరకద్ర, సీసీకుంట, భూత్పూర్, జానంపేట, అడ్డాకుల పీహెచ్సీలకు కేటాయించినట్లు వెల్లడించారు. కరోనా సోకి ఇండ్లలో వసతు లు లేని వారికోసం దేవరకద్ర కేజీబీవీలో ఐసోలేషన్ కేం ద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. లాక్డౌన్ విధించిన త ర్వాత కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్కు సహకరించాలని కోరా రు. జిల్లాలో 34 నుంచి 7.5 శాతానికి గ్రాఫ్ పడిపోయిందని, ఐదు రెట్లు కేసులు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు.అనంతరం దేవరకద్ర మండలకేంద్రంలోని పశువుల దవాఖానను ఎమ్మెల్యే సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపా రు. అనంతరం చిన్నచింతకుంట మండలంలోని పీహెచ్సీకి రూ.60 వేల విరాళాన్ని వైద్యుడు బల్రాంకు ఎమ్మె ల్యే ఆల అందజేశారు. వీటిని ఫ్యాన్లు, ఇన్వర్టర్, మెయింటనెన్స్కు ఉపయోగించుకోవాలని తెలిపారు.