నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా దవాఖానను బుధవారం ఎమ్మెల్యే భగత్తో కలిసి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కమలా నెహ్రూ దవాఖానలో కరోనా రోగుల కోసం 80 బెడ్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. దవాఖానలో విద్యుత్తు సమస్యలేకుండా కొత్త జనరేటర్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ భగవాన్నాయక్, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కర్న బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.