గువాహటి, జూలై 11: ఈశాన్య రాష్ర్టాలలో కలప స్మగ్లింగ్కు పాల్పడుతూ ‘అస్సాం వీరప్పన్’గా గుర్తిం పు పొందిన యూనైటెడ్ పీపుల్స్ రెవెల్యూషనరీ ఫ్రంట్ (యూపీఆర్ఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ మంగిన్ కొల్హో హత్యకు గురయ్యాడు. అస్సాంలోని కర్బి అంగ్లాంగ్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన అనుచరులతో జరిగిన వాగ్యు ద్ధం కాల్పులకు దారి తీయడంతో వాళ్లే మంగిన్ను కాల్చేసినట్టు పోలీసులు తెలిపారు.