జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంరభోత్సవాలు చేశారు. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షల 50 వేలతో నిర్మించిన ఎరువుల గోదాంను ప్రారంభించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలక వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే