గువహటి : కొవిడ్-19పై అసోం మంత్రి చంద్ర మోహన్ పటవరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పరిస్ధితికి దేవుడే కారణమని వ్యాఖ్యానించాడు. భగవంతుడి సూపర్ కంప్యూటర్ కొవిడ్-19 వైరస్ను భూమి మీదకు పంపిందని, ఇందులో మానవ ప్రమేయం ఏమీ లేదని అన్నాడు. కరోనా ఎవరికి సోకాలి..ఎవరికి రాకూడడు..ఈ భూమిపై ఎవరికి నూకలు చెల్లాయనేది ప్రకృతే నిర్ణయించిందని పేర్కొన్నాడు.
రెండు శాతం మరణాల రేటుతో కంప్యూటర్ కొవిడ్-19ను భూమిపైకి పంపాలని నిర్ణయించిందని చెప్పుకొచ్చాడు. ఇక అసోంలో తాజాగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.75 శాతంగా నమోదైందని అధికారులు వెల్లడించారు.