గువాహటి: అసోంలో అసోం గణపరిషత్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ( Assam minister ) అతుల్ బోరాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంట్లో నీరసంగా ఉందన్న అనుమానంతో అతుల్ బోరా ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్గా తేలింది. దాంతో ఆయన వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అతుల్ బోరా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు ఇవాళ కరోనా పాజిటివ్గా తేలిందని, సింప్టమ్స్ స్వల్పంగా ఉన్నాయని బోరా ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు పాజిటివ్ వచ్చినందున ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న కార్యకర్తలు, అధికారులు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అతుల్ బోరా కోరారు.