గౌహతి: పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించిన, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పోలీసులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఒక సందర్భంలో పోలీసులు కాల్పులు కూడా జరిపారు. అస్సాంలోని దరాంగ్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆక్రమణలకు వ్యతిరేకంగా అధికారులు, పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొందరు స్థానికులు కర్రలతో పోలీసులపై దాడికి యత్నించారు. ప్రతిగా పోలీసులు తమ లాఠీలతో వారిని చావకొట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు తుపాకీ కాల్పులు కూడా జరిపారు. ఈ ఘర్షణలో ఈ ఘర్షణలో ఇద్దరు మరణించగా 9 మంది పోలీసులు, ఇద్దరు స్థానికులు గాయపడ్డారు. ఈ ప్రాంతంలోని రాష్ట్ర ఫార్మింగ్ ప్రాజెక్టు స్థలాన్ని ఆక్రమించిన 800 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో సోమవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ తూర్పు బెంగాల్కు చెందిన ముస్లిం ప్రజలు అధికంగా నివాసం ఉంటున్నారు.
కాగా, పోలీసులు ఒక వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.