గౌహతి : గ్రనేడ్ పేలుడులో చనిపోయిన మృతుల కుటుంబాలకు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. దిగ్బాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తింగ్రాయ్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ పేలుడులో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు దిబ్రుగర్ ఏఎంసీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కాగా అసోం సీఎం బాధిత కుటుంబాలను శనివారం పరామర్శించారు. పేలుడుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పేలుడుకి బారువా నేతృత్వంలోని ఉల్ఫా(ఐ) కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు పేర్కొనగా ఈ ఆరోఫణలను తిరుగుబాటుదారుల బృందం ఖండించింది.