గౌవహతి : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అస్సాం జాతీయ పరిషత్ పార్టీకి చెందిన నాయకులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్సాంలో బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ ఆశీర్వాద్ యాత్రలో బీజేపీ ప్రముఖలంతా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఏజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర విపత్తుశాఖ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోనోవాల్ను స్వాగతం పలికేందుకు 200 మందికి పైగా గౌవహతి విమానాశ్రయంలో గుమిగూడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులు జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా దేశంలోని 13 రాష్ట్రాల్లోని 265 జిల్లాలు.. 212 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 142 రోజుల్లో 19,567 కిలోమీటర్ల మేర మంత్రులంతా ప్రయాణించనున్నారు.