గౌహతి: అస్సాంలోని సిల్చార్కు చెందిన ఒక మహిళ 5.2 కేజీల బరువున్న బాబుకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోనే అత్యధిక బరువున్న నవజాత శిశువుగా సతీంద్ర మోహన్ దేవ్ సివిల్ హాస్పిటల్ డాక్టర్ హనీఫ్ అఫ్సర్ తెలిపారు. సీనియర్ డాక్టర్ల బృందం మంగళవారం మధ్యాహ్నం ఆమెకు సిజేరియన్ చేసినట్లు చెప్పారు. జయ దాస్, బాదల్ దాస్ దంపతులకు ఈ బాబు రెండో సంతానమని, తొలి సంతానం కూడా 3.8 కిలోల బరువుతో పుట్టినట్లు వెల్లడించారు. అస్సాంలో నవ జాత శిశువుల సగటు బరువు 2.5 కేజీలని తెలిపారు. 4 కేజీల బరువుతో పుట్టిన శిశువు ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక బరువున్న శిశువుగా రికార్డులో ఉండగా 5.2 కేజీల బరువుతో తాజాగా పుట్టిన బాబు ఆ రికార్డును బ్రేక్ చేశాడని అన్నారు. 5.2 కేజీల బరువుతో శిశువు పుట్టడం చాలా అరుదని అన్నారు.