బాల్కొండ(ముప్కాల్), జూన్ 8: వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ అన్నారు. బాల్కొండలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలు రైతు వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉం టూ తగిన సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. నూతన సాంకేతిక విజ్ఞానం, అధిక దిగుబడులు సాధించడానికి రైతు వేదికలు తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. నూతన పట్టాదారుల నుంచి రైతుబంధు దరఖాస్తు ఫారాలను సేకరించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేందర్రెడ్డి, ఏఈవో అరుణ, పలువురు రైతులు పాల్గొన్నారు.