ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితి దిగజారితే దీనికి ముందుగానే నిర్ణయం తీసుకోవచ్చని హెచ్చరించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ శుక్రవారం సమీక్ష జరిపారు. పూణేలో కరోనా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. హోలీ వేడుకపై కఠిన ఆంక్షలు విధించాలని, జనం గుమిగూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ ఉండకూడదని భావించే ప్రజలు కరోనా నిబంధనలు, సామాజిక దూరాన్ని పక్కాగా పాటించాలని సూచించారు. కరోనా రోగులకు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.