గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం తెలియదని, కేవలం ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి మరోపేరు మోసం అంటూ ఆయన మండిపడ్డారు.
అసోంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా తేయాకు తోటల కార్మికుల కోసం ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. వారు అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయ పర్యాటకం కోసం మాత్రమే రాష్ట్రాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ 10 ఏండ్లు ప్రధానిగా ఉన్నా అసోంకు కనీసం పదిసార్లు కూడా రాలేదని, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 35 సార్లు వచ్చారని నడ్డా చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే..!
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు