న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్లో భాగంగా టీకాల ఉత్పత్తి శరవేగంగా కొనసాగుతున్నది. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు 50 కోట్లు, కొవాక్సిన్ డోసులు 40 కోట్లు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్లు, జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ డోసులు 5 కోట్లు, స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు 10 కోట్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్రం తన అఫిడవిట్లో వివరించింది.