న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. నెల రోజుల క్రితం రోజుకు నాలుగు లక్షల చొప్పున నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు లక్షకు చేరువైంది. అయితే కేసుల ప్రభావం తగ్గినా.. కరోనా పరీక్షలు మాత్రం భారీగానే జరుగుతున్నాయి. రోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు.
బుధవారం కూడా కొత్తగా 21,59,873 శాంపిళ్లను పరీక్షించారు. దాంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 35,37,82, 648కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఈ వివరాలను వెల్లడించింది.