పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్, 26: రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అంగడిపేట, కోదండాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, శుద్ధి చేసి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, పీఏసీఎస్ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచులు సత్తమ్మ, రాణి, ఎంపీటీసీలు మైనం సంధ్య, మద్దిమడుగు కలమ్మ పాల్గొన్నారు.
డిండి : మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ నాగార్జున్రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు ఏమిరెడ్డి వెంకట్రెడ్డి, బత్తిని శ్రీనివాస్రెడ్డి, పిఏసీఎస్ సీఈఓ తూం అంతిరెడ్డి, ఏఈఓ వెంకటేశ్, కాట్రావత్ వెంకట్రాం, కొర్ర రవి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మారుతి సుజుకి మాజీ ఎండీ కన్నుమూత
ఓటు హక్కు వినియోగించుకున్న మమతాబెనర్జి