జలంధర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే రెడ్టేపిజం, ఇన్స్పెక్టర్ రాజ్ను అంతమొందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్లోని జలంధర్లో కేజ్రీవాల్ బుధవారం వర్తకులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన చట్టాలను సవరించి అవసరం లేని చట్టాలను తొలగిస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ పారిశ్రామికవేత్తలు తిరగాల్సిన అవసరం లేని వ్యవస్ధను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.
పైస్ధాయిలో నిజాయితీతో కూడిన సీఎం, మంత్రివర్గం ఉంటే కిందిస్ధాయిలో అధికార యంత్రాగం సజావుగా ఉంటుందని అన్నారు. ఢిల్లీలో తాము ఈ తరహా వ్యవస్ధను తీసుకువచ్చామని గుర్తుచేశారు. అంతకుముందు కేజ్రీవాల్ జలంధర్లోని దేవి తలాబ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ సహా దేశమంతా పురోగతిలో సాగాలని ప్రార్ధించేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. పంజాబ్లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.