న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్ఎస్బీ మాజీ డీజీ అరుణ్ చౌదరి ఇకలేరు. అనారోగ్యంతో ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అరుణ్ చౌదరి 1977 బ్యాచ్ బీహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి.
కాగా, అరుణ్చౌదరి తన సర్వీసులో చివరిసారిగా సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఆయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ల్లో కూడా ఆయన పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు