గరిష్ఠ ధర రూ.10.99 లక్షలు
నూఢిల్లీ, మార్చి 10: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాంప్యాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ను సరికొత్తగా తీర్చిదిద్ది మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది ఫోర్డ్ ఇండియా. వినియోగదారులు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసి ఇవ్వనున్న ఈ కారును సిగ్నీచర్ కూడా ఉండనున్నది. పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్న ఈ కారు రూ.10.49 లక్షల నుంచి రూ.10.99 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ నూతన మోడల్తో పంచర్ కిట్ కూడా ఇస్తున్నది. ఈ కిట్తో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే టైర్ రిపేర్ చేసుకోవచ్చును.