హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,63,903 పెరిగాయి. ఇప్పటివరకు 5,22,082 మంది కోలుకున్నారు. మరో 38,632 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,189కి పెరిగాయి. ఇవాళ 91,048 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.