చండీగఢ్: పాకిస్థాన్కు చెందిన 51 మంది హిందువులు గత కొన్ని నెలలుగా పంజాబ్లో చిక్కుకున్నారు. పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు గత ఏడాది భారత్కు వచ్చిన వీరు, కరోనా ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్లో ఉండిపోయారు. పాకిస్థాన్కు చెందిన హిందువుల్లో మహిళలతోపాటు పిల్లలు కూడా ఉన్నారు. తమను పాకిస్థాన్కు తిరిగి పంపించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. అమృత్సర్ జిల్లా కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. తమ దేశానికి తిరిగి పంపుతామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని పాకిస్థాన్లోని సింధ్ నివాసి రాధ తెలిపారు.
మరోవైపు కరోనా ఆంక్షల నేపథ్యంలో చిక్కుకున్న పాకిస్థాన్ హిందువులకు ఉచితంగా బస, ఆహారం అందిస్తున్నట్లు అమృత్సర్లోని దుర్గాయానా ధర్మశాల కమిటీ చైర్మన్ నరేశ్ శర్మ తెలిపారు. వారు పాకిస్థాన్కు తిరిగి వెళ్లేవరకు దీనిని కొనసాగిస్తామని చెప్పారు. పాకిస్థాన్ హిందువులు చాలా పేదవారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం తమ బాధ్యతని ఆయన అన్నారు.