న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్ని పార్టీల సభాపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము దాదాపు 16-17 అంశాలను తాము వెంకయ్యనాయుడు ముందు ఉంచామని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. వాటిలో ద్రవ్యోల్బణం, పేదరికం, కొవిడ్ సంక్షోభం లాంటి పలు అంశాలు ఉన్నాయన్నారు.
తాము ఆయన దృష్టికి తెచ్చిన అన్ని అంశాలపైన చర్చకు అవకాశం ఇస్తానని వెంకయ్యనాయుడు చెప్పారని, కానీ తాము ఆయా అంశాలను సభలో లేవనెత్తినప్పుడు మాత్రమే వారు అవకాశం ఇస్తారో, ఇవ్వరో అనే విషయం తెలుస్తుందని మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.