ముంబై: గతేడాది సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు రెండో చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ అర్ణబ్ గోస్వామిని నిందితుడిగా పేర్కొన్నారు. టీవీ చానెళ్లలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లను (ప్రకటనలు) ఆకర్షించడానికి పలువురు కుంభకోణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.