సర్వేకు యూపీ కోర్టు ఆదేశం
వారణాసి, ఏప్రిల్ 8: వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపీ మసీదును సర్వే చేయాలని పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను స్థాని క కోర్టు ఆదేశించింది. పురాతన విశ్వేశ్వరుడి గుడిని మొఘ ల్ చక్రవర్తి ఔరంగజేబు కూలగొట్టించి… ఆ శిథిలాలతో అక్కడే మసీదు నిర్మించాడంటూ మూడు దశాబ్దాల క్రితం దాఖలైన ఓ పిటిషన్పై ఈ ఆదేశాలు ఇచ్చిం ది. సర్వేకు పురావస్తు నిపుణులు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేయాలని, వారిలో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందినవా రు ఉండాలని ఏఎస్ ఐను కో ర్టు ఆదేశించింది. ఈ కమిటీకి పరిశీలకుడిగా ప్రముఖ విద్యావేత్తను నియమించాలని తెలిపింది. స్థానిక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేస్తామని సున్నీవక్ఫ్ బోర్డు తెలిపింది.