దక్షిణ కొరియాకు ఆర్మీ చీఫ్ నరవణే

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే దక్షిణ కొరియాకు సోమవారం బయలుదేరారు. ఆ దేశంలో మూడు రోజులపాటు ఆయన పర్యటిస్తారని ఆర్మీ తెలిపింది. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. సియోల్లో యుద్ధ స్మారక చిహ్నం సందర్శన, ఆ దేశ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, రక్షణ సముపార్జన ప్రణాళిక పరిపాలన మంత్రితో నరవణే సమావేశమవుతారని వెల్లడించింది. గ్యాంగ్వాన్ ఇంజే కౌంటీలోని కొరియా సైనిక శిక్షణా కేంద్రం, డేజియోన్లోని ఏజెన్సీ ఫర్ డిఫెన్స్ డెవలప్మెంట్ను ఆయన సందర్శిస్తారని తెలిపింది. భారత్, దక్షిణ కొరియా మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఆర్మీ చీఫ్ పర్యటన దోహదపడుతుందని పేర్కొంది. కాగా కరోనా కాలంలో జనరల్ నరవణే విదేశాల్లో పర్యటించడం ఇది ఐదవది. ఇప్పటికే మయన్మార్, నేపాల్, యూఏఈ, సౌది అరేబియా దేశాల్లో ఆయన పర్యటించారు.
తాజావార్తలు
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్షాప్లు
- ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది