మహబూబ్నగర్, ఏప్రిల్ 12 : ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా ఇం టింటికీ ఆల్బెండజోల్ మా త్రలు ఇవ్వాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 1 నుంచి 19ఏండ్లలోపు పిల్లల్లో నులిపురుగులను నిర్మూలించేందుకు అవసరమైన ముం దస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారని, ప్రస్తుతం కొవిడ్ భద్రత మార్గదర్శకాలను అనుసరించి ఇంటింటికీ ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని తెలిపారు. 1 నుంచి 2 ఏండ్లలోపు పిల్లలకు సగంమాత్ర, 2 నుంచి 19ఏండ్లలోపు పిల్లలకు పూర్తి మాత్ర (400 గ్రాములు) పంపిణీ చేయాలని సూ చించారు. ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ముఖ్యపాత్ర అని, వారికి ఇచ్చిన జాబితా ప్రకారం మాత్రలను అందించాలని తెలిపారు. జిల్లాలో 1-19 ఏండ్ల వయ స్సు ఉన్న పిల్లలు 2లక్షల 78వేల 511మందిని గుర్తించామని, వీరందరికీ సుమారు 3లక్షల 2వేల 300 ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా అర్హత ఉన్న పిల్లలందరికీ మాత్రలు వేసేందుకు డీఆర్డీవో, విద్య, సంక్షేమ శాఖల ద్వారా గ్రామస్థాయి సిబ్బందికి లేఖలు రాయాలని తెలిపారు. మాత్రలు వేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఇంట్లోని వారు కూడా మాస్కు ధరించేలా చూడాలని కలెక్టర్ ఆ దేశించారు. మాత్రలు ఇచ్చిన తర్వాత ఎవరికైనా వాం తులు, వికారం, వీరేచనాలు వంటివి ఏర్పడితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, జెడ్పీ సీఈ వో జ్యోతి తదితరులు ఉన్నారు.