హజీపూర్: పట్టపగలే ఐదుగురు దుండగులు ఓ ప్రైవేట్ బ్యాంక్లో చొరబడి, సిబ్బందిని బెదిరించి రూ.1.19 కోట్లతో ఉడాయించారు. బీహార్లోని హజీపూర్లో ఈ ఘటన జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇంటి సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బ్యాంకు తెరవగానే ఐదుగురు వ్యక్తులు బైకులపై వచ్చి లోనికి చొరబడ్డారు. నేరుగా క్యాష్ రూమ్లోకి వెళ్లి బ్యాగుల్లో రూ.1.19 కోట్లు నింపుకొని పరారయ్యారు.
అయితే చోరీకి పాల్పడిన వాళ్లు సీసీటీవీ కెమెరాలకు చిక్కారని పోలీసులు తెలిపారు. వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఇప్పటికే అన్ని సరిహద్దులూ మూసివేసినట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. గత వారం ఇలాగే ముజఫర్నగర్లో ఇద్దరు వ్యాక్తులు ఆయుధాలతో వచ్చి బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు.