చెన్నై: ఐపీఎల్ 2021 సన్నాహకంలో భాగంగా తొమ్మిది రోజుల కండిషనింగ్ క్యాంప్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మంగళవారం ప్రారంభించింది. హెడ్ కోచ్ సైమన్ కటిచ్, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ మార్గదర్శకత్వంలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, పేసర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ సహా 11 మంది ఆటగాళ్ళు సాధన మొదలెట్టారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేసిన తర్వాత మిగతా ఆటగాళ్ళు శిబిరంలో చేరతారు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చే గురువారం జట్టులో చేరనున్నాడు. అతను కూడా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు.