లోక్సభకు కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో 59 శాతం ప్రాంతాల్లో భూకంపం ముప్పు పొంచి ఉన్నదని సెస్మిక్ జోనింగ్ మ్యాప్ పేర్కొంది. ఈ ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. జోన్ V (భూకంపం ముప్పు ఎక్కువ) క్యాటగిరీలో 11 శాతం ప్రాంతం, జోన్ IVలో 18 శాతం, జోన్ IIIలో 30 శాతం, జోన్ IIలో (భూకంపం ముప్పు తక్కువ) మిగతా ప్రాంతం ఉన్నట్టు వెల్లడించింది. అ మేరకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్సభకు తెలిపారు.