ఎల్కతుర్తి, మార్చి 25 : రైతులకు లాభాల ‘పట్టు’ దొరికేందుకు మల్బరీసాగుతో పట్టు పురుగుల పెంపకం ఎంతగానో దోహదపడుతున్నది. ఒకే విధమైన పంటలు కాకుండా ఆసక్తి ఉన్నవారు పట్టు పరిశ్రమ వైపు మళ్లితే మంచి ఆదాయమార్గంగా ఉండనుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితోనే ప్రతినెలా పంట చేతికందుతుంది. ప్రభుత్వం కూడా 100శాతం సబ్సిడీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది.
లాభసాటిగా ఉంది
గతంలో పత్తి, వరి, మక్క పంటలు పండించేటోళ్లం. సంవత్సరానికి ఒక పంట మాత్రమే వచ్చేది. పెట్టుబడు లు పోను ఏమీ మిగలకపోయేది. కానీ పట్టు సాగు చేసినప్పటి నుంచి మంచి ఆదాయం వస్తున్నది. ఏడాదికి 8 పంటలు తీస్తున్నం. ఇదివరకు కిలోకు రూ.75 చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చే వారు. మళ్లీ ఇస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.