ఆఖరి దశకు పోటీలు
తెలంగాణ బాలికల జట్టుకు నిరాశ..
జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్
సూర్యాపేట, నమస్తే తెలంగాణ: రసవత్త రంగా జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. సూర్యాపేట వేదికగా సాగుతున్న దేశంలోని 29 రాష్ర్టాలు, భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) నుంచి మొత్తం 60 జట్లు టోర్నీ బరిలోకి దిగాయి. బుధవారంతో నాకౌట్ మ్యాచ్లు ముగియగా, పోటీలకు ఆఖరి రోజైన గురువారం క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. లీగ్ దశలో అద్భుత పోరాట పటిమ కనబరిచిన తెలంగాణ బాలికల జట్టుకు నిరాశ ఎదురైంది. జార్ఖండ్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో తెలంగాణ 42-58 తేడాతో ఓటమిపాలైంది. పాయింట్ల కోసం ఇరు జట్లు కడదాకా హోరాహోరీగా పోరాడాయి. రైడింగ్తో పాటు డిఫెన్స్లో జార్ఖండ్ను నిలువరించలేకపోయిన మన అమ్మాయిలు ఓటమివైపు నిలువాల్సి వచ్చింది. మిగతా మ్యాచ్ల్లో చండీగఢ్ 51-25 తేడాతో ఢిల్లీపై, హర్యానా 74-34తో పంజాబ్పై గెలిచి ముందంజ వేశాయి. బాలుర విభాగంలో హర్యానా 50-19తో కర్ణాటకపై, సాయ్ 43-8తో ఆంధ్రాపై, చండీగఢ్ 58-32తో గుజరాత్పై, ఉత్తరప్రదేశ్ 36-12తో జార్ఖండ్పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాయి. ఇదిలా ఉంటే 2022లో జరిగే ఆసియా గేమ్స్లో ఆడే భారత కబడ్డీ జట్లకు ఈ టోర్నీ నుంచే ప్లేయర్లను ఎంపిక చేస్తామని రా్రష్ట్ర సంఘం కార్యదర్శి జగదీశ్వర్యాదవ్ పేర్కొన్నారు. బాలుర, బాలికల నుంచి మొత్తం 72 మందిని ఎంపిక చేసేందుకు ఆరుగురు సెలెక్టర్లు సూర్యాపేటకు వచ్చారని ఆయన తెలిపారు. ఆఖరి రోజు పోటీలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి హాజరుకానున్నారు.