అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం ఫైన్ వేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు.
చివరి టీ20లో భారత్ 36 పరుగులతో విజయం సాధించి సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్నది. భారత్తో నాలుగో టీ20లో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా వేశారు.