న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కూడా దేశంలో 53,480 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.
కాగా, గడిచిన 24 గంటల్లో నమోదైన 53,480 కొత్త కేసులలో 84.73 శాతం కేసులు కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. మొత్తం కొత్త కేసులలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే 85 శాతం మంది ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 27,918 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ