దండేపల్లి, మార్చి 29 : దండేపల్లి మండలం రెబ్బెన్పెల్లికి చెందిన ఎనిమిది మంది ఆర్మీ జవాన్లను సోమవారం రాత్రి సర్పంచ్ కందుల కల్యాణి ఆధ్వర్యంలో ఎస్ఐలు, పలువురు సన్మానించారు. స్థానిక ఎల్లమ్మ-పోచమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్న వీరిని ఆదర్శంగా తీసుకొని, దేశ రక్షణలో పాలుపంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, లక్షెట్టిపేట ఎస్ఐ దత్తాద్రి, ఉప సర్పంచ్ రెంక అనిల్, ఎంపీటీసీ బత్తుల మౌనిక, యూట్యూబ్ స్టార్ ఆవిరెడ్డి ప్రియ, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ చుంచు చందు, టీఆర్ఎస్ నాయకులు కందుల అశోక్, రాకేశ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!
ఏపీలో కొత్తగా 997 కరోనా కేసులు