న్యూఢిల్లీ: ఓ రూపాయి నాణెం ఓ వ్యక్తిని రూ.10 కోట్లకు అధిపతిని చేసింది. 1885లో భారత్లో బ్రిటి ష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీచేసిన ఓ పురాతన నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండేది. ప్రస్తుతం చెల్లని ఆ నాణెం వూరికే జేబులో ఉంటే ఏం వస్తుంది? అని అనుకున్నాడో ఏమో.. దాన్ని ఓ వెబ్సైట్ వేలానికి పెట్టాడతను. పురాతన నాణేలు సేకరించే అలవాటు ఉన్న ఓ ఔత్సాహికుడు దానికి రూ.10 కోట్లు చెల్లించాడు. అంతే, రాత్రికి రాత్రి ఆ నాణెం గల వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.