వాషింగ్టన్, మే 5: కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం ఆయన వైట్హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ‘భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడాను. ఆయన కోరిన సాయాన్ని చేస్తున్నాం. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని భారత్కు అందజేశాం’ అని తెలిపారు. మరోవైపు ఆరు విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని ‘యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్’ భారత్కు పంపిస్తున్నది.