కొవిడ్ బారినపడి ఇబ్బందులు పడుతున్నారా.. వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారా.. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా.. అలాంటివారి కోసం జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్రూంలో ప్రత్యేకంగా వైద్యులను నియమించింది.. పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు, సలహాలు, సూచనలను ఈ వైద్యులు అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. తిరిగి రెండు నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ వైద్యులు సేవలు అందించనున్నారు.. కంట్రోల్ రూం నుంచి ఫోన్ ద్వారా కొవిడ్ నివారణ కోసం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తించే వైద్యులకు సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్య లు చేపడుతున్నదని చెప్పారు. కొవిడ్ బాధితుల కోసం జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని.. బాధితులు 040-2111 1111 కు ఫోన్చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం 104కు వచ్చే కాల్స్ను కూడా కొవిడ్ కంట్రోల్ రూం నంబర్కు అనుసంధానం చేస్తున్నట్లు రిజ్వీ పేర్కొన్నారు.