న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలను ఆదుకునేందుకు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ ముం దుకొచ్చాడు. తన ఫౌండేషన్ ‘యు వీ కెన్’ ద్వారా తెలం గాణ సహ పలు రాష్ర్టాల దవాఖానల్లో వేయి పడకలు సమకూర్చేందుకు సిద్ధమయ్యాడు. వన్ డిజిటల్ ఎంటైర్టైన్మెంట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ, ఆర్మీ, చారిటబుల్ దవాఖానల్లో ప్రత్యేక వసతులు కల్పించనున్నాడు.