జెనెవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించారు. ప్రజలంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకాలు తీసుకొని ప్రాణాలను కాలపాడుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.
బుధవారం సాయంత్రం జెనీవాలోని యూనివర్షిటీ హాస్పిటల్లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన పేరును రిజిస్టర్ చేసుకున్న 56 ఏండ్ల టెడ్రోస్.. తన వంతు వచ్చిందని సమాచారం ఇవ్వడంతో వెళ్లి టీకా వేయించుకున్నాడు.
“ఈ రోజు కొవిడ్-19 కు టీకా వేసుకునే నా వంతు వచ్చింది. టీకాలు ప్రాణాలను కాపాడతాయి. వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైనది. నాలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తుంటే.. దయచేసి మీ వంతు వచ్చినప్పుడు టీకాలు తీసుకోండి” అని ట్విట్టర్లో రాశారు.
మధ్య చైనాలోని వుహాన్ నగరంలో గుర్తుతెలియని వ్యాధి వ్యాప్తి గురించి 2019 డిసెంబర్ చివరలో చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్ఓ) సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రపంచదేశాల్లోని అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ జాడలు కనిపించాయి. 2020 మార్చి 11 న కరోనావైరస్ను మహమ్మారిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
విడిపోతే కష్టాలు ఎదుర్కొంటాం : అజీమ్ ప్రేమ్జీ
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..